1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2017 (14:52 IST)

పిల్లలు మేల్కొన్నారనీ 'అందుకు' అంగీకరించని ప్రియురాలు... ప్రియుడు ఏం చేశాడంటే...

కడప జిల్లా ఎర్రగుంట్లలో ఓ దారుణం జరిగింది. శారీరకంగా కలిసేందుకు నిరాకరించిన ప్రియురాలిపై ప్రియుడు దాడి చేశాడు. అంతేనా, తల్లిపై జరుగుతున్న దాడిని అడ్డుకోబోయిన పిల్లలను కూడా చితకబాదాడు.

కడప జిల్లా ఎర్రగుంట్లలో ఓ దారుణం జరిగింది. శారీరకంగా కలిసేందుకు నిరాకరించిన ప్రియురాలిపై ప్రియుడు దాడి చేశాడు. అంతేనా, తల్లిపై జరుగుతున్న దాడిని అడ్డుకోబోయిన పిల్లలను కూడా చితకబాదాడు. దీంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఎర్రగుంట్ల సమీపంలోని వేంపల్లిరోడ్డులోని ఎస్సీకాలనీలో చిలమకూరు మరళికి జ్వాలమ్మ అనే మహిళతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, జ్వాలమ్మకు అదే ప్రాంతానికి రాజేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న భర్త మురళి గతంలో రాజేష్‌పై కత్తితోదాడిచేశాడు. దీంతో మురళిపై 307 కేసునమోదైంది. దాడి జరిగినా రాజేష్‌ - జ్వాలమ్మల మధ్య కొనసాగుతున్న వివాహేతర సంబంధం విడిపోలేదు.
 
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి జ్వాలమ్మ ఇంటికి రాజేష్‌ వెళ్లాడు. ఆ సమయంలో పిల్లలు మేల్కొని ఉన్నారు. దీంతో అతనితో కలిసి శారీరక సుఖం పంచుకునేందుకు జ్వాలమ్మ నిరాకరించింది. దీంతో ప్రియురాలితో వాగ్వాదానికి దిగి ఘర్షణ పడి, ఆమెపై కత్తితో దాడి చేశాడు.

ఈ దాడిని జ్వాలమ్మ పిల్లలు అడ్డుకున్నారు. దీంతో వారిపై కూడా రాజేష్ దాడిచేసి తీవ్రంగా గాయపరచాడు. తీవ్రంగా గాయపడిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో ఉన్న ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.