1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (18:40 IST)

5 వరకు మిర్చియార్డు బంద్.. ఎందుకో తెలుసా?

కరోనా ఎఫెక్ట్ గుంటూరు మిర్చియార్డు పైనా పడింది. కరోనా వ్యాప్తి కారణంగా మిర్చియార్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల ఐదు వరకు మిర్చి యార్డ్‌ కార్యకలాపాలను నిలిపేయనున్నారు.

కరోనా నివారణ చర్యల్లో భాగంగానే మిర్చి యార్డ్‌ను మూసేయాలని నిర్ణయించారు. తిరిగి వచ్చే నెల ఆరున మిర్చి యార్డ్‌ ప్రారంభిస్తామని యార్డ్‌ ఛైర్మన్‌ ఏసురత్నం తెలిపారు.