శుక్రవారం, 6 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 జూన్ 2025 (12:33 IST)

భూకబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్ ఈనో వాడండి: నారా లోకేష్

nara lokesh
వైకాపా జగన్మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. విశాఖలో తాను భూకబ్జా చేసినట్లు జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నారా లోకేష్ సవాల్ చేశారు. ఒక్క రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపించాలని, ఒకవేళ ఆ ఆరోపణలు అబద్ధమని తేలితే యువతకు జగన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
 
ఇంకా నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డికి కొత్తేమీ కాదని తెలిపారు. ఉర్సా కంపెనీకి విశాఖలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటీ పార్ట్ హిల్ -3లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించామని, కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాం. 
 
కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాం. బురదజల్లి ప్యాలస్‌లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండి. ఛాలెంజ్‌కు సిద్ధమా జగన్ రెడ్డి?' అని ప్రశ్నించారు. అలాగే ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారని చెప్పారు. 
 
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని వెల్లడించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడుతున్నాం. కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈనో వాడండి కాస్త రిలీఫ్ వస్తుందని తీవ్ర విమర్శలు చేశారు లోకేష్‌.