గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 4 నవంబరు 2019 (21:15 IST)

అయ్యో... కె.ఎ.పాల్‌ను ఆ దోమ కుట్టిందట

కె.ఎ.పాల్. ఎన్నికల ముందు ప్రజా శాంతి పార్టీ పెట్టి జనంలోకి వెళ్ళిన కె.ఎ.పాల్ చేసిన హడావిడి గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా కె.ఎ.పాల్ పేరు మార్మోగిపోయింది. ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపి, జనసేనలకు పోటీగా ప్రజాశాంతి పార్టీని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒకే ఒక్కడుగా పార్టీలో ఉంటూ కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టారు.
 
ఇదంతా ఒక ఎత్తయితే ఎన్నికల తరువాత కె.ఎ.పాల్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఒకే ఒక్క సీటు కూడా గెలవకపోవడం.. చివరకు కె.ఎ.పాల్ నామినేషన్‌ను ఒకచోట తీసుకోకపోవడం ఆ పార్టీని, కె.ఎ.పాల్‌ను లేవలేని స్థితిలోకి తీసుకెళ్ళింది. ఆ తరువాత కె.ఎ.పాల్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పార్టీ గురించి అస్సలు చర్చలేదు. ఎప్పుడైనా యు ట్యూబ్‌లలో వీడియోలు చూస్తే మాత్రం జనం కె.ఎ.పాల్ అంటూ కాసేపు నవ్వుకుంటుంటారు.
 
అయితే అలాంటి కె.ఎ.పాల్‌ను డెంగ్యూ దోమ కుట్టిందట. డెంగ్యూ ఫీవర్‌తో కె.ఎ.పాల్ గత మూడురోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారట. ప్లేట్‌లెట్ ఒక్కసారిగా పడిపోయి సన్నగా అయిపోయారట కె.ఎ.పాల్. అస్సలు గుర్తుపట్టలేని విధంగా కె.ఎ.పాల్ తయారయ్యారట. తనను కలవడానికి ఎవరినీ రావద్దని కె.ఎ.పాల్ ఇప్పటికే చెప్పడమే కాకుండా తన సెల్‌ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట.