1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 17 జులై 2019 (14:37 IST)

స్నేహితులున్నారు.. జాగ్రత్త.. పాయసంలో మత్తుమందు కలిపి?

ఇదేంటి అనుకుంటున్నారా? ప్రసాదంలో మత్తుమందు కలిపి.. నగలు దోచుకున్న ఓ కిలేడీ ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహం చేద్దామని.. నమ్మకం ఏర్పడేలా చేసి.. ఆపై బంగారాన్ని దోచుకున్న మహిళ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ వ్యవహారం సత్యనారాయణపురం పోలీస్టేషన్‌ పరధిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అబ్బూరివారి వీధికి చెందిన సత్యవాణి ఎక్కువగా ఆలయాలను సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో స్థానిక శివాలయంలో ముప్పాళ్ల ఆదిలక్ష్మి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా బలపడింది. 
 
ఒకరింటికి ఒకరు రావడం పోవడం వంటివి జరుగుతూ వచ్చాయి. తనకు ఇదే ప్రాంతంలో అద్దెకు ఇల్లు కావాలని ఆదిలక్ష్మి కోరగా.. సత్యవాణి తన గృహానికి సమీపంలోనే ఇల్లు ఇప్పించింది. పౌర్ణమి సందర్భంగా తమ ఇంటికి భోజనానికి రావాలంటూ ఆదిలక్ష్మి.. సత్యవాణిని ఆహ్వానించింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం వెళ్లింది. ఆదిలక్ష్మి పులిహోర, పాయసం ఇతర రుచికరమైన ఆహారాన్ని వడ్డించింది. 
 
అది తిన్న నిముషాల వ్యవధిలోనే సత్యవాణి స్పృహ తప్పిపడిపోయింది. కొద్దిసేపటికి తేరుకొని చూసుకునే సరికి ఒంటిపై ఉన్న బంగారం మొత్తం మాయమైంది. మోసపోయామనే విషయాన్ని తెలుసుకుని.. భర్తతో పాటు సత్యవాణి సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆహారంలో మత్తు మందు కలిపి, 20కాసుల బంగారం చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.