శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (20:00 IST)

చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించా : కారెం శివాజీ (వీడియో)

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ చెప్పుకొచ్చారు. ఆయన మంగళవారం వీఐపీ బ్రేక్ సమయం

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ చెప్పుకొచ్చారు. ఆయన మంగళవారం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి నేటితో 40 యేళ్లు పూర్తయ్యాయని, ఈ శుభ సందర్భంలో శ్రీవారిని దర్శనం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని శ్రీవారిని కోరినట్టు చెప్పారు. 
 
అంతేకాకుండా, విభజన కారణంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రార్థించినట్టు చెప్పారు. ఇకపోతే, రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు సమర్థంగా అమలు చేస్తున్నారనీ, కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. 
 
అలాగే తాను ఇపుడు రాజకీయాల్లో లేనని, అదేసమయంలో తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదన్నారు. కానీ, దేవుడు దయ తలిస్తే పదవులు వాతంటత అవే వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.