శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (10:45 IST)

టీచర్‌పై యాసిడ్ పోసిన వ్యక్తి.. ట్యుటోరియల్‌లో ట్యూషన్ చెప్తుండగా?

మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. హైదరాబాదులోని చింతల్‌లో ఓ టీచర్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లో

మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. హైదరాబాదులోని చింతల్‌లో ఓ టీచర్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 49 ఏళ్ల ఉప్పులూరి సూర్యకుమారి, లక్ష్మీనారాయణ దంపతులు స్థానిక పద్మానగర్‌ ఫేజ్‌-2లో నివసిస్తున్నారు.
 
సూర్యకుమారి చింతల్ కాకతీయ నగర్‌లోని సిద్ధార్థ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నారు. అదే ప్రాంతలో ఓ గది అద్దెకు తీసుకుని ట్యుటోరియల్ నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం ట్యూషన్ చెబుతుండగా రాత్రి 7:30 గంటల సమయంలో ముఖానికి కర్చిఫ్ కట్టుకుని వచ్చిన  గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆమెపై యాసిడ్ పోసి పారిపోయాడు.
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సూర్యకుమారిని వెంటనే స్థానికులు కూకట్ పల్లిలోని రెమిడీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.