బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (14:16 IST)

తిరుపతిలో దూసుకెళుతున్న కార్లు... ఇద్దరి మృతి : ఎంపీ శివప్రసాద్ బంధువులే కారణమా?

ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతిలో పాశ్చాత్య సంస్కృతి ప్రవేశిస్తోంది. ఒకవైపు కార్ రేసింగ్‌లు మరోవైపు స్కూటర్ రేసింగ్‌లతో యువత ప్రజలను తీసేస్తోంది. మద్యానికి అలవాటుపడే యువత తమ వాహనాలను రోడ్డుపై వేగంగా నడుపు

ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతిలో పాశ్చాత్య సంస్కృతి ప్రవేశిస్తోంది. ఒకవైపు కార్ రేసింగ్‌లు మరోవైపు స్కూటర్ రేసింగ్‌లతో యువత ప్రజలను తీసేస్తోంది. మద్యానికి అలవాటుపడే యువత తమ వాహనాలను రోడ్డుపై వేగంగా నడుపుతూ ప్రజల ప్రాణాలను తీసేస్తున్నారు. ఇలాంటి సంఘటనే తిరుపతిలో జరిగింది. ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
 
తిరుపతిలో అర్థరాత్రి ఒక కారు బీభత్సం సృష్టించింది. అవిలాల సమీపంలోని హెచ్.పి.గ్యాస్ ఏజెన్సీ సమీపంలో ఒక కారు అతి వేగంగా వచ్చి బిల్డింగ్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో జయ, శశి అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 10 మంది స్నేహితులు కార్ రేస్ పెట్టుకుని అవిలాల నుంచి తిరుపతి నగరంలోకి ప్రవేశిస్తుండగా ప్రమాదం జరిగింది.
 
అతి చిన్న రోడ్డయిన అవిలాల ప్రాంతంలో కార్ రేసింగ్ పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ప్రజా సంఘాల నేతలు. మద్యం మత్తులో యువకులు చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు. స్వయంగా చిత్తూరు ఎంపి శివప్రసాద్ బంధువులే ఈ ప్రమాదానికి కారణంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం విషయాన్ని బయటకు పొక్కనీయకుండా కేవలం రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేస్తున్నారు.