గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (11:57 IST)

క్యాటరింగ్ పేరుతో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. కాదంటే నరకమే...

క్యాటరింగ్ పేరుతో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించే ముఠాగుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. అశ్లీల నృత్యాలు చేసేందుకు నిరాకరిస్తే మాత్రం ఆ అమ్మాయిలకు నరకమే. ఇలా అమ్మాయిలను ట్రాప్ చేసే ముఠాకు చెందిన ఆర

క్యాటరింగ్ పేరుతో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించే ముఠాగుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. అశ్లీల నృత్యాలు చేసేందుకు నిరాకరిస్తే మాత్రం ఆ అమ్మాయిలకు నరకమే. ఇలా అమ్మాయిలను ట్రాప్ చేసే ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఏపీ రాష్ట్ర వాణిజ్య నగరమైన విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌లోని న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతానికి చెందిన తమ బాలిక కనిపించడం లేదని ఓ తల్లి ఇటీవల స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అమ్మాయిల కిడ్నాప్‌ వెనుక ఉన్న గుట్టును కనుగొన్నారు. 
 
విజయవాడ నగరంలో పేదవర్గాలు అధికంగా నివసించే ఈ ప్రాంతాలపై ఓ ముఠా కన్నేసింది. 15, 16 ఏళ్ల వయస్సు ఉన్న బాలికలకు మాయమాటలతో వలేసింది. క్యాటరింగ్‌ పనులు ఇప్పిస్తామని నమ్మించి, తమతో తీసుకెళ్లింది. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో జరిగే జాతరలు, ఉత్సవాల్లో వీరితో ఈ ముఠా అశ్లీల నృత్యాలు చేయించి, డబ్బులను తన జేబులో వేసుకుంటూ వస్తోంది. నృత్యాలు చేసేందుకు నిరాకరిస్తే మాత్రం వారికి నరకం చూపించేది. 
 
ఇలా విజయవాడ - విశాఖ నగరాల మధ్య కొంతకాలంగా సాగిపోతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు రట్టుచేశారు. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ఆరుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ట్రాప్‌, కిడ్నాప్‌ సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి గుప్పిట్లో ఉన్న 15 మంది బాలికలకు పోలీసులు విముక్తి కలిగించారు.