శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (14:16 IST)

రాష్ట్ర మహిళల పాలిట నరకాసురుడు.. బాబును ఇంకెవ్వరితో పోల్చాలి.. రోజా ఫైర్

డ్వాక్రా మహిళలను నిండా ముంచేసిన ఏపీ సీఎం చంద్రబాబు, రాష్ట్ర మహిళల పాలిట నరకాసురుడేనని వైకాపా మహిళా నేత రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్‌తో సంబంధమున్న తెలుగుదేశం నేతలను వెనకేసుకుని వస్తూ, ఇసుక దందాను ప్రశ్నించిన మహిళా అధికారులను కాళ్లతో తన్నిన ఎమ్మెల్యేను కాపాడుకుంటూ వస్తున్న చంద్రబాబునాయుడిని నరకాసురుడితో కాకుండా ఇంకెవరితో పోల్చాలని రోజా ప్రశ్నించారు. 
 
ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ల అక్రమ రవాణాలో దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరిందని, ఇది కూడా చంద్రబాబు ఘనతేనని ఎద్దేవా చేశారు. ఇంకా గురువారం రోజా మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించిన 600 హామీలను అమలు చేయడంలో విఫలమైందని చెప్పారు. అలాంటి పార్టీకి ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. మహిళలను అప్పుల పాలు చేసిన చంద్రబాబును, శూర్పణకల వంటి మహిళా మంత్రులు మాత్రమే దేవుడంటున్నారని విమర్శలు గుప్పించారు.