మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : గురువారం, 29 నవంబరు 2018 (14:50 IST)

కరివేపాకు చూర్ణాన్ని మజ్జిగలో కలిపి తీసుకుంటే..?

రాజకీయాల్లో తమను కరివేపాకుల్లా వాడి పారేశారని కొందరు నేతలు తరచూ వాపోతుండటాన్ని వింటుంటాం. ఆ మాటల్లో సైతం కరివేపాకును ఎంత చిన్న చూపు చూస్తున్నామో తెలుస్తోంది. అయితే దానిని సరైన రీతిలో వాడుకుంటే ఎలాంటి వ్యాధులనైనా.. వైద్యుల అవసరం లేకుండానే పరిష్కిరించుకోవచ్చును. కానీ, విషయాన్ని మాత్రం ఎవ్వరూ అంతగా పట్టించుకోరు. కరివేపాకులోని ప్రయోజనాలు తెలుసుకుంటే తప్పక మంచి ఫలితాలు లభిస్తాయి.
 
1. కరివేపాకును పచ్చడిగానో లేదా విడిగానో తీసుకోవచ్చను. అలాకాకుంటే కరివేపాకు రసాన్ని మజ్జిగలో కలుపుకుని రోజూ తాగితే జీర్ణాశయం చక్కగా పని చేస్తుంది.
 
2. వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నవారు రోజూ ఉదయం పది నుండి పదిహేను కరివేపాకులను నమిలి తినాలి. ఇలా నెలరోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే మధుమేహ వ్యాధి నుండి విముక్తి లభిస్తుంది. 
 
3. కడుపులో వికారంగా ఉన్నప్పుడు, వాంతులు అవుతున్నపుడు.. రెండు చెంచాల కరివేపాకు రసంలో కొద్దిగా నిమ్మరసం, పంచదార కలిపి తీసుకుంటే ఇలాంటి సమస్యల రావు.
 
4. కరివేపాకు బాగా ఎండబెట్టుకుని పొడిచేసి అందులో కొద్దిగా తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడివేడి అన్నంలో కలిపి సేవిస్తే విరోచనాలు తగ్గుతాయి. 
 
5. కాలిన గాయాల మీద కరివేపాకు నూరి కట్టుకడితే గాయాలు త్వరగా తగ్గుముఖం పడతాయి. 
 
6. కరివేపాకు రసాన్ని పురుగులు కుట్టిన ప్రాంతాల్లో రాసుకుంటే దద్దుర్లు తగ్గిపోతాయి.
 
7. కరివేపాకును ముద్దగా నూరి, చెంచాడు ముద్దను గ్లాస్ మజ్జిగలో కలిసి తీసుకుంటే కడుపులో వికారాన్ని నివారించవచ్చు. గర్భవతులకు కూడా ఇది ఉపయోగపడుతుంది.