శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 17 సెప్టెంబరు 2018 (15:22 IST)

కలబంద గుజ్జు, నిమ్మరసంతో ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే?

నిమ్మరసాన్ని ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మెడపై గల నల్లటి వలయాలు తొలగిపోతాయి. గుడ్డు తెల్లసొనలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ

నిమ్మరసాన్ని ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మెడపై గల నల్లటి వలయాలు తొలగిపోతాయి. గుడ్డు తెల్లసొనలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
 
టమోటా గుజ్జులో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై గల మెుటిమలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది. టమోటా ముక్కలతో ముఖాన్ని మర్దన చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. 
 
టమోటా మిశ్రమంలో కొద్దిగా బాదం నూనెను కలుపుకుని మెడకు రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే మెడపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. కలబంద గుజ్జులో తేనె, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.