గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (12:52 IST)

శెనగపిండిలో ఉప్పు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

బొప్పాయి గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై ముడతలు తొలగిపోతాయి. పెరుగులో తేనెను కలుపుకుని ముఖానికి రాసుకో

బొప్పాయి గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై ముడతలు తొలగిపోతాయి. పెరుగులో తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది.
 
బంగాళాదుంప మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖంపై గల నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. నారింజ తొక్కలను పొడిచేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. 
 
కీరదోసను మెత్తగా రుబ్బుకుని ఆ రసాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే కంటికి మంచి ఉపశమనం లభిస్తుంది. శెనగపిండిలో కొద్దిగా ఉప్పు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం ముడతలు తొలగిపోయి మృదువుగా మారుతుంది.