బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (17:00 IST)

పెరుగు, తేనెతో ఫేస్‌ప్యాక్...?

చలికాలం కారణంగా చర్మం పొడిబారి ముడతలుగా మారుతుంది. చర్మ తత్వాన్నే మార్చేస్తుంది. దాంతో ఏం చేయాలో తెలియక బయట దొరికే క్రీములు, ఫేస్‌ప్యాక్స్ వాడుతుంటారు. ఈ బయట పదార్థాలు కొందరికి సెట్ ‌అవుతుంది. మరికొందరికి సెట్ కావు. అలాంటివారి కోసం ఈ చిన్నపాటి చిట్కాలు...
 
రోజ్‌వాటర్ ఫేస్‌ప్యాక్:
రోజ్‌వాటర్‌లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. 2 స్పూన్ల్ రోజ్‌వాటర్‌కి స్పూన్ గంధం చేర్చి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంటపాటు అలానే ఉంచి ఆ తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై గల నల్లటి మచ్చలు పోతాయి. రోజ్‌వాటర్ లేని పక్షంలో గులాబీ రేకులను కూడా వాడొచ్చు.
 
పెరుగు ఫేస్‌ప్యాక్:
పెరుగు చర్మానికి మాయిశ్చరైజ్‌గా పనిచేస్తుంది. పావుకప్పు పెరుగు తీసుకుని అందులో 1 స్పూన్ తేనె కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి. ఆ తరువాత 20 నిమిషాలాగి చల్లని నీటితో కడిగేయాలి. ఇలా ప్రతిరోజూ కాకపోయినా వారంలో రెండుమూడు సార్లు క్రమంగా చేస్తే ముఖచర్మం పొడిబారకుండా ఉంటుంది. 
 
నిమ్మరసం ఫేస్‌ప్యాక్:
నిమ్మరసం ఆరోగ్యానికే కాదు అందానికి ఎంతో దోహదపడుతుంది. ఎలాగంటే.. 2 స్పూన్ల నిమ్మరసంలో కొద్దిగా శెనగపిండి, పెరుగు కలిపి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్‌ను అరగంటపాటు అలానే ఉంచాలి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మంపై గల మృతుకణాలు తొలగిపోతాయి.