శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 17 జనవరి 2018 (10:20 IST)

వేతన జీవికి ఊరట.. ఐటీ పన్ను పరిమితి పెంపు?

వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పే అవకాశం ఉంది. వచ్చే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ విషయంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాల సమాచారం.

వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పే అవకాశం ఉంది. వచ్చే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ విషయంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. 
 
ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితి రూ.2.50 లక్షలుగా ఉండగా, దాన్ని రూ.3 లక్షలకు పెంచుతూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. 
 
ఈ పరిమితిని రూ.3 లక్షలకు పెంచితే వేతన జీవులకు రూ.15,450 (30 శాతం) వరకూ ఆదా అవుతుంది. సెక్షన్ 80 సీ కింద బీమా, ఈక్విటీ లింక్డ్ మదుపు పథకాలు, పోస్టల్ డిపాజిట్లు, సుకన్యా సమృద్ధి, జాతీయ పొదుపు పథకాలు, పన్ను ఆదా చేసేలా ఐదేళ్ల కాలపరిమితిలో ఉండే బ్యాంకు డిపాజిట్లు తదితర మార్గాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ మొత్తాన్ని ఐటీ రిటర్నుల్లో చూపి రాయితీలను పొందవచ్చు.