శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 13 జనవరి 2019 (14:46 IST)

అది రైల్వే స్టేషన్ కాదు.. నక్షత్ర హోటల్.. తిరుపతి స్టేషన్‌లో లగ్జరీ సౌకర్యాలు

దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రైల్వే స్టేషన్లలో అరకొరగా సౌకర్యాలు ఉంటాయనీ, కనీసం తాగేందుకు కూడా చుక్కనీరు లభించని ప్రతి ఒక్కరి అభిప్రాయం. అలాంటి రైల్వే స్టేషన్లలో నక్షత్ర హోటల్ సౌకర్యాలు లభిస్తే. లభిస్తేకాదు.. నిజంగాన సమకూర్చారు. అదికూడా ఎక్కడో కాదు. తిరుపతి రైల్వే స్టేషన్. 
 
తిరుపతికి వచ్చి వెంకన్న స్వామిని దర్శనం చేసుకునే ప్రయాణికులకు నిజంగానే ఈ సౌకర్యాలు ఒక వింత అనుభూతిని కల్పిస్తాయి. 'అతిథి' ప్రీమియర్ లాంజ్ పేరుతో తిరుపతి రైల్వే స్టేషన్‌లో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. ఈ అతిథి లాంజ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. 
 
ఈ విషయంతో పాటు కొన్ని ఫోటోలను కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఆదివారం ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లాంజ్‌లో సౌకర్యవంతమైన రీక్లయినర్ సీట్లు, లగ్జరీగా ఉండే విశ్రాంతి గదులు కనిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వరుని నిలువెత్తు చిత్రపటం కూడా ఉంది. కాగా, ఇదే స్టేషన్‌లో త్వరలోనే ఓ మల్టీప్లెక్స్ కూడా రానుంది.