బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 ఆగస్టు 2018 (15:15 IST)

ముర‌ళీ విజ‌య్.. ఎప్పుడు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్నావు : నెటిజన్స్ ట్రోలింగ్

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆతిథ్య జట్టు చేతిలో చిత్తుగా ఓడిపోతోంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా, ఇప్పటివరకు జరిగిన తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో చిత్తుగా ఓడింది. ముఖ్యంగా, తొలి టెస్టు

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆతిథ్య జట్టు చేతిలో చిత్తుగా ఓడిపోతోంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా, ఇప్పటివరకు జరిగిన తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో చిత్తుగా ఓడింది. ముఖ్యంగా, తొలి టెస్టులో పోరాడి ఓడినప్పటికీ.. రెండో టెస్టులో మాత్రం కనీసం పోరాటం చేయకుండానే చేతులెత్తేసింది. ఫలితంగా ఏకంగా ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఓడిపోయింది.

 
దీనిపై భారత క్రికెట్ జట్టుపై సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓపెనర్ మురళీ విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. వెంట‌నే విజ‌య్‌ను జట్టు నుంచి తప్పించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 'ముర‌ళీ విజ‌య్.. ఎప్పుడు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్నావు. మ‌నీశ్ పాండే, కేదార్ జాద‌వ్‌, శ్రేయాస్ అయ్య‌ర్ టెస్టుల కోసం సిద్ధంగా ఉన్నారు', 'కేఎల్ రాహుల్, ముర‌ళీ విజ‌య్‌ల‌ను త‌ప్పించి.. కియా లీగ్‌లో అద్భుతంగా ఆడుతున్న మ‌హిళా క్రికెట‌ర్లు స్మృతి మందానా, హార్మ‌న్ ప్రీత్‌ల‌కు అవ‌కాశం కల్పించండి', 'ముర‌ళీ విజ‌య్ టైమ్ అయిపోయింది.. అత‌డిని జ‌ట్టులో నుంచి త‌ప్పించండి' అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.