ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 మే 2018 (10:47 IST)

ఐపీఎల్ 2018 : చెన్నైకు చుక్కలు చూపిన నైట్ రైడర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పోటీల్లో భాగంగా గురువారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చుక్కలు చూపించింది. ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం పోటీ పెరుగుతున్న సమయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పోటీల్లో భాగంగా గురువారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చుక్కలు చూపించింది. ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం పోటీ పెరుగుతున్న సమయంలో చక్కని ప్రదర్శన చేసింది. యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌, సునీల్‌ నరైన్‌, దినేశ్‌ కార్తీక్‌ మెరిసిన వేళ.. బలమైన చెన్నైని ఓడించింది. కోల్‌కతాకు ఇది ఐదో విజయంకాగా, చెన్నైకు ఇది మూడో  పరాజయాన్ని చవిచూసింది. ధోనీ మెరుపు ఇన్నింగ్స్‌ వృథా అయింది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. జట్టులో కెప్టెన్‌ ధోనీ నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో 43 (నాటౌట్‌) పరుగులు చేయగా, వాట్సన్‌ 2 సిక్స్‌లు, 4 ఫోర్లతో 36 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా చెన్నై 5 వికెట్లకు 177 పరుగులు సాధించింది. ప్రత్యర్థి బౌలర్లలో నరైన్‌ (2/20), కుల్‌దీప్‌ (1/34), చాల్వాల (2/35) చెన్నైని కట్టడి చేశారు. 
 
ఆ తర్వాత 178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టు బ్యాట్స్‌మెన్ నరైన్‌ 2 సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 32, మెరుపు ఆరంభాన్నిస్తే.. కార్తీక్‌ 7 ఫోర్లు, ఓ సిక్స్‌ కొట్టి 45 (నాటౌట్) కళ్లు చెదిరే ముగింపునిచ్చాడు. అలాగే, శుభమన్‌ గిల్‌ 2 సిక్స్‌లు, 6 ఫోర్ల సాయంతో 57 (నాటౌట్‌) ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలవడంతో మ్యాచ్ కోల్‌కతా సొంతమైంది.