శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (17:13 IST)

ప్రపంచ రికార్డ్‌ను సృష్టించిన మిథాలీ రాజ్.. గప్తిల్‌ను కూడా వెనక్కి నెట్టేసింది..

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో భారత జట్టు పరుగుల వరద కురిపిస్తోంది. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాపై హర్మన్ అదిరిపోయే సెంచరీ సాధించగా.. ఐర్లాండ్‌ మ్యాచ్‌లో మిథాలీ రాజ్ అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌కు విజయం అందించింది. 
 
ఈ మ్యాచ్‌లో 51 పరుగులు సాధించిన మిథాలీ తన కెరీర్‌లో 17వ అర్థ శతకాన్ని పూర్తి చేసుకుంది. ఈ స్కోర్‌‌తో మిథాలీ రాజ్ అంతర్జాతీయ మహిళల క్రికెట్ విభాగంలోనే కాకుండా పురుషుల విభాగంలోనూ దిగ్గజ క్రికెటర్లను వెనక్కి నెట్టింది. 
 
పురుషుల అంతర్జాతీయ ట్వంటీ-20 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ (2207)తో అగ్రస్థానంలో వుండగా, అతడి తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ వున్నాడు. కానీ మిథాలీ ఇదివరకే పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరి రికార్డులను బ్రేక్ చేస్తూ.. టీ-20ల్లో 2232 పరుగులతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 
 
తాజాగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ప్రపంచ రికార్డు సృష్టించింది. ట్వంట-20 క్రికెట్ చరిత్రలో కివీస్ బ్యాట్స్‌మెన్ మార్తిన్ గప్తిల్ 2271 పరుగులతో వరల్డ్ నెంబర్ వన్‌గా వుంటే.. మిథాలీ 37.43 సగటుతో 2283 పరుగులతో గప్తిల్‌ని కూడా వెనక్కి నెట్టేసింది.