దాపరికం లేకుండా మనస్సులోని మాటను వెల్లడించిన ధోనీ: రవిశాస్త్రి
టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన మనస్సులోని మాటను ఎలాంటి దాంపరికం లేకుండా వెల్లడించాడని టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
ధోనీ రిటైర్మెంట్పై రవిశాస్త్రి ఓ వెట్సైట్తో మాట్లాడుతూ.. డ్రెస్సింగ్ రూంలోకి వచ్చిన ధోనీ జట్టునంతటినీ సమావేశపరిచాడు. ఆపై తన నిర్ణయం తెలిపాడు. అక్కడ డ్రామా ఏమీ చోటు చేసుకోలేదు. దాపరికం లేకుండా మనసులో మాట వెల్లడించాడు. ఇకపై అన్ని ఫార్మాట్లూ ఆడలేనన్నాడు.
అందుకే టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాని చెప్పాడు. తానేం చేయదల్చుకున్నాడో అదే చేసే వ్యక్తి ధోనీ. చివరి వరకు సత్యానికి కట్టుబడ్డాడు. అన్ని ఫార్మాట్లు ఆడలేనని చెప్పగలిగిన అతని ధైర్యమే స్పష్టం చేస్తుంది... తన పట్ల, సహచరుల పట్ల ఎంత నిజాయతీగా వ్యవహరించాడో అని వివరించాడు.