శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (16:08 IST)

అంజీర పండ్లు తింటే.. ఏమవుతుంది..?

అంజీర పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ కాలంలో ఎక్కువగా వీటినే అమ్ముతున్నారు. అంజీర పండ్లలోని విటమిన్ ఎ, బి1, బి2, క్యాల్షియం, ఐరన్, పాస్పరస్, మెగ్నిషియం, పొటాషియం వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. ఇవన్నీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగేలా చేస్తాయి. ఈ క్రమంలో నిత్యం అంజీర పండ్లు తీసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం..
 
1. హైబీపీతో బాధపడేవారు నిత్యం అంజీర పండ్లు తింటే మంచిది. ఎందుకంటే.. అంజీరలోని పొటాషియం హైబీపీని అదుపులో ఉంచుతుంది. దాంతో గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. 
 
2. అంజీర పండ్లు నిత్యం తినడం వలన నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం పొందవచ్చును. నిద్ర చక్కగా పడుతుంది. అలానే డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.
 
3. అంజీర పండ్లను తినడం వలన పురుషుల్లో వీర్యం వృద్ధి చెందడమే కాకుండా శృంగార సమస్యలు పోతాయి. దంపతులు శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు.
 
4. ఈ వేసవికాలంలో చాలామందికి శరీరంలో వేడి అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. ఉదయాన్నే పరగడుపున అంజీర పండ్లను తింటుంటే శరీరానికి చలువ చేస్తుంది.
 
5. రక్తహీనత సమస్యతో బాధపడేవారు తరచు ఈ పండు తింటే మంచిదంటున్నారు వైద్యులు. ముఖ్యంగా శరీరంలో రక్తం బాగా తయారైయ్యేలా చేస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.