గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (16:45 IST)

నోరు చేదుగా ఉందా.. అయితే ఇలా చేయండి..?

వేసవికాలంలో చల్లదనం కోసం ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదని చాలామంది ఆలోచిస్తుంటారు. మరికొందరైతే ఏం తీసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. శరీరానికి చల్లదనంతో పాటు చర్మ సంరక్షణను అందించే కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు చాలా అధికంగా ఉన్నాయి. వేసవి కాలంలో కీరదోసతో ఉపశమనం పొందడమే కాదు ఆరోగ్యాన్నీ రెట్టింపు చేయొచ్చు.
 
కీరదోస తినడం వలన శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుంది. దాంతో శరీరంలోని చెడు మలినాలు, విష పదార్థాలు బయటకు పోతాయి. ముఖ్యంగా కిడ్నీలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. కీరదోసను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిల్లో కొద్దిగా ఉప్పు, కారం వేసి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా తరచు తింటుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు చర్మం ముడతలన్ని నివారిస్తుంది.
 
కీరదోసలోని విటమిన్ ఎ, బి, సి, మెగ్నిషియం, పొటాషియం, సిలికాన్ వంటి మినరల్స్ అధిక మోతాదులో ఉంటాయి. కీరదోస ముక్కలను కంటిపై పెట్టుకుంటే.. కంటి అలసట, ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. కీరదోస శరీర వేడిని తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతుంది. ఎండ ప్రభావం కారణంగా చర్మం కందిపోతుంది. అలాంటప్పుడు కీరదోస ముక్కలతో చర్మం మీద రుద్దుకుంటే సాంత్వన లభిస్తుంది. 
 
తరచు కీరదోస తింటుంటే నోటి దుర్వాసన తగ్గుతుంది. కీరదోసతో రోజూ తింటే.. అధిక రక్తపీడనం, అల్ప రక్తపీడనం వంటి సమస్యలు తగ్గిపోతాయి. దీనిలోని ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. సాధారణంగా జ్వరంగా ఉన్నప్పుడు నోరు చేదుగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. కీరదోస ముక్కలో తింటే ఫలితం ఉంటుంది. దాంతో శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది.