శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 9 జనవరి 2016 (14:04 IST)

రక్తహీనతకు చెక్ పెట్టే అంజీర పండ్లు.. పోషక విలువలెన్నో!

అప్పుడే మార్కెట్‌లోకి తాజా పండ్లని తీసుకుంటేనే వాటి వల్ల ప్రయోజనం ఉంటుందని చాలామంది నమ్ముతుంటారు కాని అది నిజం కాదు. కొన్ని పండ్లలో తాజాగా కన్నా అవి ఎండిపోయాకే వాటి పోషకాలు రెట్టింపవుతాయని కొందరు నిపుణులు అంటున్నారు. అలాంటి పండ్లలో అంజీర ఒకటి. అంజీర రక్తహీనత సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. 
 
ఎండు పండ్లను ఎంతకాలమైనా నిలువ చేసుకోవచ్చు. ప్రత్యేకించి అంజీర పండులో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు కావలసినంత పీచుపదార్థం కూడా ఉంది. పలురకాల పోషకాలతో పాటు శరీరానికి ఎంతో మేలు చేసే ఫైటో కెమికల్స్‌ కూడా సమృద్ధిగా ఉంటాయి. అంజీరలో చాలా విలువైన పోషకాలున్నాయని న్యూట్రిషన్లు అంటున్నారు.
 
తాజా పండుగా చూసినా మిగితా వాటితో పోలిస్తే అంజీరాలో ఎక్కువ పోషకాలు, ఎక్కువ కేలరీలు ఉన్నాయి. అంజీర పండ్లను విడిగానే కాకుండా ఇతర పండ్లతో కలిపి కూడా తీసుకోవచ్చు. అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతకు అంజీర పండ్లు గొప్ప ఔషధంగా పనిచేస్తుంది.