శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 24 జులై 2019 (18:06 IST)

జీవామృతాలు చిరుధాన్యాలు...

దేశవ్యాప్తంగా కరవుకాటకాలు ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా, వర్షపాతం గణనీయంగా తగ్గిపోయింది. అతివృష్టి లేదా అనావృష్టి మాత్రమే కనిపిస్తోంది. దీంతో ఎక్కువ నీటితో పండించే వరి వంటి పంటలు పడించే పరిస్థితి అయితే లేదు. ఈ క్రమంలో అతి తక్కువ నీటితో పండించే పంటలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ క్రమంలో ఇటీవలి కాలంలో చిరు ధాన్యాలే భవిష్యత్ ఆహార ధాన్యాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. వీటిలో అన్ని రకాల పోషక విలువలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. భారతీయ సంప్రదాయ ఆహారపు గింజలుగా చిరు ధాన్యాలను పేర్కొంటున్నారు.
 
తృణ ధాన్యాలు అనేవి ఇపుడు కొత్తగా తెరపైకి వచ్చినవి కావని, ఇవి మన పూర్వీకుల నుంచి వస్తున్న జీవామృతాలుగా పలువురు పేర్కొంటున్నారు. మనిషి ఆరోగ్యం వారి ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశంలో పాశ్య్చాత్య ఆహారపు అలవాట్లు విపరీతంగా పెరిగిపోయాయి. 
 
ఫలితంగా అనేక రకాలైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి సమయంలో చిరుధాన్యాలను వాడినట్టయితే మనిషికి కావాల్సిన పూర్తిస్థాయి పోషక విలువలు అందుతాయని పేర్కొంటున్నారు. వీటివల్ల మధుమేహం, బీపీతో అనేక రకాల వ్యాధులను అరికట్టవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.