శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (21:03 IST)

వరసిద్ధ వినాయకునికి వెంకన్న పట్టువస్త్రాలు..

కాణిపాక వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాంబశివరావు పట్టువస్త్రాలను వరసిద్ధి వినాయకునికి శుక్రవారం సమర్పించారు. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కాణిపాకానికి విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం లభించింది. ఈవో పూర్ణచంద్రరావు దగ్గరుండి స్వాగతం పలికారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టువస్త్రాలను కాణిపాకం ఈవో తీసుకున్నారు.