శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (18:37 IST)

చంద్రగిరి రామాలయాన్ని సందర్శించిన టీటీడీ ఈవో సాంబశివరావు

ఇటీవల టీటీడీలో విలీనమైన చంద్రగిరి కోదండ రామాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాంబశివ రావు తనిఖీ చేశారు. శుక్రవారం ఆయన ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. 
 
కాణిపాకంలో వరసిద్ధ వినాయకునికి పట్టువస్త్రాలను సమర్పించడానికి వెళ్ళిన ఆయన తిరుగు ప్రయాణంలో చంద్రగిరిలోని ఆలయానికి వెళ్ళారు. అక్కడి సిబ్బంది ఆయన స్వాగతం పలికారు. దాదాపు 500 యేళ్ళ చరిత్ర కలిగిన ఆ ఆలయంలో చేయాల్సిన పరిస్థితులను పరిశీలించాలి. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం పురాతన ఆలయాలను కాపాడడం వాటి ప్రాశిత్యాన్ని కాపాదుతామని ఆయన అన్నారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని ఆయన చెప్పారు.