శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: బుధవారం, 22 ఏప్రియల్ 2015 (22:00 IST)

25న శ్రీ రామునికి పుష్పయాగం.. పోస్టరు విడుదల చేసిన జేఈవో

తిరుమల తిరుపతి దేవస్ధానం ఆద్వర్యంలో 25న తిరుపతిలోని కోదండ రామాలయంలో పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ పుష్పయాగానికి సంబంధించిన గోడ పత్రికలను టిటిడి తిరుపతి జేఈవో పోలా భాస్కర్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుష్పయాగం ఏప్రిల్ 25న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటలలోపు జరుగుతుందని చెప్పారు. 24న అంకురార్పణ జరగుతుందన్నారు. 
 
పుఢమి తల్లి నుంచి ఎటువంటి విపత్తులు రాకుండా ఈ కార్యక్రమాన్ని తరతరాలుగా నిర్వహిస్తున్నారని చెప్పారు. గోడ పత్రిక విడుదల చేసిన కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.