గోవిందరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆరంభమయ్యాయి. మొదటి రోజున పండితులు పవిత్ర సమర్పణ నిర్వహించారు. తెల్లవారుజామున కైంకర్యాలు మొదలుకాక మునుపు స్నపన తిరుమంజన కార్యక్రమం చేపట్టారు.
పవిత్ర మాలలను ఊరేగించారు. అనంతరం గోవింద రాజస్వామి సమర్పించారు. గోవింద రాజస్వామి అనుబంధ ఆలయాలలో కూడా వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో చంద్రశేఖర్ పిళ్లై ఏఈవో ప్రసాదమూర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.