తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 26 కంపార్టుమెంట్లు నిండాయి. వారాంతం కావడంతో శుక్రవారం సాయంత్రమే భక్తుల తాకిడి పెరిగింది. ఇది శనివారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి.
గదుల వివరాలు:
ఉచిత గదులు - 16 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు - 112, ఖాళీగా ఉన్నాయి
రూ.100 గదులు- 24, ఖాళీగా ఉన్నాయి
రూ.500 గదులు- 8 ఖాళీగా ఉన్నాయి
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం - 102ఖాళీగా ఉన్నాయి
సహస్ర దీపాలంకరణసేవ - 42 ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం - 89 ఖాళీగా ఉన్నాయి