శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2015 (09:06 IST)

ఈ-దర్శన్‌ కేంద్రాలలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

తిరుమల శ్రీవారి దర్శనమే మహాభాగ్యమనుకునే భక్తులు ఎంతో మంది ఉన్నారు. తనివితీరా స్వామి చూసుకుంటే ఈ జన్మధన్యమవుతుందని భావించే వారు ఉన్నారు. విఐపీలకు మాత్రమే ఎక్కువగా లభించే ఆర్జిత సేవా భాగ్యం మరి సామాన్యులకు కూడా దక్కితే.. అంతకంటే ఆనందం ఏముంది? సరిగ్గా టీటీడీ కూడా అదే చేసింది. ఈ దర్శన్ కేంద్రాల ద్వారా ఆర్జిత సేవా టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. 
 
దేశంలో 85 ఈ- దర్శన్‌ కేంద్రాలున్నాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విక్రయానికి అనుమతినిస్తూ కోటాను కూడా విడుదల చేసింది. ఈ కేంద్రాల్లో ఆర్జిత సేవా టిక్కెట్లతో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.