శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (18:24 IST)

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మరింత వైభవంగా నిర్వహిస్తాం... టీటీడీ ఛైర్మన్ చదలవాడ

సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్క ఉద్యోగి తన వంతు కృషి చేశారని ఆ ఉత్సాహంతోనే శరన్నవరాత్రి ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో చదలవాడ కృష్ణ మూర్తి అన్నారు. శుక్రవారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  
 
బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంతో పోలీసులు, జిల్లా అధికారులు, ఏపీఎస్ఆర్‌టీసీ అధికారులు ఆర్టీవో అధికారులు సమన్వయంగా పని చేయడం వలననే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పని చేశాయని వివరించారు. తమ అనుభవాన్ని రంగరించి బ్రహ్మోత్సవాలను నిర్వహించారని చెప్పారు. అవసరమైనన్ని గేట్లను ఏర్పాటు చేయడంలో విజిలెన్సు అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు.  
 
ఇదే ఉత్సాహంతో రాబోవు పక్షం రోజుల్లో వచ్చే నవరాత్రి ఉత్సవాలను మరింత పకడ్బందిగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు.