శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 29 నవంబరు 2017 (13:40 IST)

చిచ్చుపెట్టిన చైనా : భారత్ - పాక్‌ల మధ్య యుద్ధం తప్పదా?

ఆధిపత్యపోరులో భాగంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చైనా చిచ్చుపెట్టింది. దీంతో దాయాది దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనా తలపెట్టిన భారీ బడ్జెత్‌తో నిర్మితమవుతున్న చైనా - పాకిస్థాన్ ఎకనామిక్

ఆధిపత్యపోరులో భాగంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చైనా చిచ్చుపెట్టింది. దీంతో దాయాది దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనా తలపెట్టిన భారీ బడ్జెత్‌తో నిర్మితమవుతున్న చైనా - పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ వల్ల భారత ఉపఖండంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితులు ఏర్పడనున్నాయి. దీనికంతటికీ చైనా ప్రధాన కారణమని అమెరికా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
భారత్ - పాకిస్థాన్‌ల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకునే అంశంపై విల్స్ సెంటర్ దక్షిణాసియా డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కూగల్ మెన్ స్పందిస్తూ, చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ను నిర్మించడమే చైనా ప్రధాన లక్ష్యమని... అయితే, ఈ వ్యవహారం చివరకు భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్రఉద్రిక్తతలకు కారణమవుతుందని అభిప్రాయపడ్డారు. 
 
అందువల్ల చైనా కోరికల మేరకు పాకిస్థాన్ పని చేస్తోందని.. ఇది పాకిస్థాన్ తన రక్షణ, ఆర్థిక వ్యవస్థలను స్వయంగా నాశనం చేసుకోవడమేనని కూగల్ మెన్ చెప్పారు. అయితే, ఈ ప్రాజెక్టును భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని... ప్రాజెక్టు ముందుకు సాగితే, ఆసియాలో ఉద్రిక్తతలు నెలకొంటాయని ఆందోళన వ్యక్తంచేశారు.