శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (16:16 IST)

జమ్మూకాశ్మీర్‌లోకి 450మంది టెర్రరిస్టులు? అమర్‌నాథ్‌ యాత్రను లక్ష్యంగా?

జమ్మూకాశ్మీర్‌లోకి చొరబడేందుకు 450మంది టెర్రరిస్టులు వేచి చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. నియంత్రణ రేఖ వద్ద వివిధ లాంచ్ ప్యాడ్స్ వద్ద కనీసం 450 మంది పాకిస్థాన్ టెర్రరిస్టులు వేచి

జమ్మూకాశ్మీర్‌లోకి చొరబడేందుకు 450మంది టెర్రరిస్టులు వేచి చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. నియంత్రణ రేఖ వద్ద వివిధ లాంచ్ ప్యాడ్స్ వద్ద కనీసం 450 మంది పాకిస్థాన్ టెర్రరిస్టులు వేచి చూస్తున్నారని నిఘా సంస్థలు వెల్లడించాయి. ఈ టెర్రరిస్టుల్లో హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా ఉగ్రవాదులు వున్నారని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 
 
జూన్ 28 నుంచి ప్రారంభమయ్యే అమర్‌ నాథ్ యాత్రను వీరు లక్ష్యంగా చేసుకున్నారని ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. రంజాన్ మాసం సందర్భంగా తీవ్రవాద వ్యతిరేక దాడులకు భారత్ విరామం ప్రకటించిన నేపథ్యంలో.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఉగ్రవాద సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను జమ్మూకాశ్మీర్‌లోకి అడుగుపెట్టనీయకుండా భారత సైన్యం తగిన ఏర్పాట్లు చేస్తోంది. బందోబస్తును పటిష్టం చేసింది.