శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 12 జూన్ 2018 (09:19 IST)

సెల్‌ఫోన్లు పేలాయి.. కారులో మంటలు.. మహిళకు ఎలా తప్పించుకుందంటే?

సెల్‌ఫోన్లు ఛార్జింగ్‌లో పెట్టినప్పుడు పేలిన ఘటనలు చూస్తూనేవున్నాం. కానీ తాజాగా అమెరికాలోని మిచిగాన్‌లో సెల్ ఫోన్ పేలడం ద్వారా కారు కాలి బూడిదైంది. కారులో నుంచి మహిళ దూకేసి ప్రాణాలు కోపాడుకుంది. దీంతో

సెల్‌ఫోన్లు ఛార్జింగ్‌లో పెట్టినప్పుడు పేలిన ఘటనలు చూస్తూనేవున్నాం. కానీ తాజాగా అమెరికాలోని మిచిగాన్‌లో సెల్ ఫోన్ పేలడం ద్వారా కారు కాలి బూడిదైంది. కారులో నుంచి మహిళ దూకేసి ప్రాణాలు కోపాడుకుంది. దీంతో పెను ప్రమాదం తప్పింది.


వివరాల్లోకి వెళితే.. మిచిగాన్‌కు చెందిన నిస్సాన్ మాగ్జిమా అనే మహిళ కారును డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా, ఆమె దగ్గరున్న రెండు శాంసంగ్ ఫోన్లలో ఒకదాని నుంచి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు కారంతా వ్యాపించాయి. 
 
దీంతో పక్కనే వెళ్తున్న ప్రయాణీకులు కారు నుంచి దూకేయాలంటూ సూచించారు. వెంటనే కారు రోడ్డు పక్కకు తీసుకొచ్చిన సదరు మహిళ.. అందులో నుంచి దూకేసి ప్రాణాలను కాపాడుకుంది. అయితే మహిళ దూకేసిన కొద్ది సేపట్లోకే కారు బూడిదైపోయింది. ఈ ఘటనపై శాంసంగ్‌ స్పందించింది. మంటలు ఎందుకు వచ్చాయో దర్యాప్తు చేస్తామని శామ్‌సంగ్ వెల్లడించింది.