1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (13:14 IST)

సునామీలో నీట మునిగింది.. రోమ్ నగరంలో బయటపడిన తునిసియా (video)

రోమ్ నగరంలో సముద్రం నీటితో మునిగిన రాజ్యాన్ని పురావస్తు నిపుణులు కనుగొన్నారు. సునామీతో ఏర్పడిన విధ్వంసం కారణంగా ఆ రాజ్యం నీట మునిగి వుండవచ్చునని పురావస్తు నిపుణులు అంటున్నారు. తునిసియా దేశానికి ఈశాన్య

రోమ్ నగరంలో సముద్రం నీటితో మునిగిన రాజ్యాన్ని పురావస్తు నిపుణులు కనుగొన్నారు. సునామీతో ఏర్పడిన విధ్వంసం కారణంగా ఆ రాజ్యం నీట మునిగి వుండవచ్చునని పురావస్తు నిపుణులు అంటున్నారు. తునిసియా దేశానికి ఈశాన్యం వైపు గల రోమ్ రాజ్యానికి చెందిన నాబూల్‌ను పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. ఈ రాజ్యం నాలుగో శతాబ్ధంలో ఏర్పడిన సునామీ కారణంగా నీట మునిగిపోయిందని వారు అనుమానం వ్యక్తం చేశారు. 
 
ఈ రాజ్యంలోని వీధులు, శాసనాలు, వంద ట్యాంకులను తవ్వకం ద్వారా వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. 50 ఎకరాలతో కూడిన ఈ రాజ్యాన్ని వెలికితీయడం ద్వారా ప్రాచీన కాలం శిలాఖండాలు బయటపడ్డాయి. 365 ఏడీ జూలై 21న ఏర్పడిన సునామీతో అలెగ్జాండ్రియా, ఈజిప్టు, గ్రీకు దేశాల్లో పెను విధ్వంసం ఏర్పడింది. ఇక కొత్తగా కనిపెట్టబడిన ఈ నగరం రసాయనాల తయారీకి, చేపల ఉత్పత్తి ఇక్కడ నుంచే జరిగిందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.