శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2017 (13:27 IST)

రిలయన్స్‌కు పోటీగా మైక్రోమ్యాక్స్: భారత్-1 పేరిట 4జీ ఫోన్

దేశ వ్యాప్తంగా రిలయన్స్ జియో విడుదల చేసిన 4జీ ఫీచర్ ఫోనుకు పోటీగా మైక్రోమ్యాక్స్ సంస్థ ''భారత్-1'' పేరిట 4జీ ఎల్టీఈ ఆధారిత ఫోన్‌ను విడుదల చేసింది. రిలయన్స్ జియో ఫోను కంటే కాస్త అధికంగా.. అంటే రూ.2,20

దేశ వ్యాప్తంగా రిలయన్స్ జియో విడుదల చేసిన 4జీ ఫీచర్ ఫోనుకు పోటీగా మైక్రోమ్యాక్స్ సంస్థ ''భారత్-1'' పేరిట 4జీ ఎల్టీఈ ఆధారిత ఫోన్‌ను విడుదల చేసింది.  రిలయన్స్ జియో ఫోను కంటే కాస్త అధికంగా.. అంటే రూ.2,200 లకు లభిస్తుంది. రూ.2,200లకు లభించే ఈ ఫోనులోబీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకుంటే, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ యాక్సెస్, కాలింగ్, ఎస్ఎంఎస్, ఉచిత రోమింగ్ తదితరాలన్నీ నెలకు రూ. 97 రీచార్జ్‌తోనే లభిస్తాయి. 
 
వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రిలయన్స్ జియో ఫీచర్ ఫోనుతో పోలిస్తే భారత్-1 చాలా చౌకగా వచ్చినట్టవుతుందని ఐటీ నిపుణులు అంటున్నారు. రెండేళ్ల పాటు జియో వాడితే.. రూ. 5,172 అవుతుందని, అదే మైక్రోమాక్స్ ఫోన్ భారత్-1 వాడితే రూ. 4,528 మాత్రమే అవుతుందని వారు చెప్తున్నారు. ఇక మూడేళ్ల కాలపరిమితికి పరిశీలిస్తే, జియో ఫోన్‌కు రూ. 6,008 వెచ్చించాల్సి రాగా, భారత్-1కు రూ. 5,692 మాత్రమే అవుతుందని మైక్రోమాక్స్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. 
 
భారత్-1 ఫోన్ ఫీచర్స్.. 
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 2015 ప్రాసెసర్, 
4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 
512 ఎంబీ రామ్ 
2.4 అంగుళాల స్క్రీన్, 
2ఎంపీ, వీజీఏ కెమెరాలు, 
భారత భాషలకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.