గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (10:18 IST)

గడువులోగా మొబైల్ - ఆధార్‌ లింక్ చేయాల్సిందే : కేంద్రం

ఆధార్ - మొబైల్ నంబర్ల లింకుపై కేంద్ర ప్రభుత్వం మరోమారు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దేశంలోని అన్ని మొబైల్‌ నెంబర్లను ఆధార్‌తో తప్పనిసరిగా లింక్‌ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. వచ్చే యేడాది ఫిబ్రవర

ఆధార్ - మొబైల్ నంబర్ల లింకుపై కేంద్ర ప్రభుత్వం మరోమారు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దేశంలోని అన్ని మొబైల్‌ నెంబర్లను ఆధార్‌తో తప్పనిసరిగా లింక్‌ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. వచ్చే యేడాది ఫిబ్రవరి ఆరో తేదీని చివరి తేదీగా ప్రకటించింది. 
 
మరోసారి మార్పులు ఉండవని తేల్చి చెప్పింది. ఆధార్‌, మొబైల్‌ నెంబర్‌ అనుసంధానంపై గడువుతేదీలో మార్పులు ఉండవని తెలిపింది. అయితే బ్యాంక్‌ అకౌంట్లకు గడుపు తేదీని మాత్రం మార్చి 31 వరకూ ప్రభుత్వం పొడిగించింది.
 
ఆధార్‌తో అనుసంధానం చేయడం అనేది.. వ్యక్తిగత గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టులో వేల సంఖ్యలో పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిని రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ఇదిలావుండగా, మార్చి 31లోపు ఆధార్‌తో అనుసంధానం చేయని అన్ని రకాల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలని ఆయా బ్యాంకులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే.