నుబియా నుంచి కొత్త రెడ్ మ్యాజిక్ 5ఎస్.. మార్కెట్లోకి మరో 5జీ గేమింగ్ ఫోన్..  
                                       
                  
				  				   
				   
                  				  ప్రముఖ గేమింగ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నుబియా తన కొత్త ఫోన్ రెడ్ మ్యాజిక్ 5ఎస్ను లాంచ్ చేసింది. తొలుత ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. రెడ్ మ్యాజిక్ 5జీ, రెడ్ మ్యాజిక్ 5జీ లైట్ల తర్వాత ఆ సిరీస్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో అప్ గ్రేడెడ్ కూలింగ్ సిస్టం ఐస్ 4.0ను కూడా అందించారు. 
	 
	ఇందులో వెనకవైపు 64 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఐస్ విండ్, సైబర్ నియాన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన సేల్ మొదట ఆగస్టు 1వ తేదీన చైనాలో జరగనుంది. అలాగే స్మార్ట్ ఫోన్ కూల్ చేయడానికి అవసరమైన డాక్ కూలింగ్ యాక్సెసరీని కూడా ఇందులో అందించనున్నారు. దీని ధర సుమారు రూ.1,900గా ఉంది. ఈ ఫోన్ మిగతా దేశాల్లో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియాల్సి ఉంది. 
				  
	 
	ఫీచర్లు.. 
	ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత నుజియాయూఐ (రెడ్ మ్యాజిక్ ఓఎస్) ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	ఇందులో 6.65 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు.
	ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.
				  																		
											
									  
	 
	16 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండటం విశేషం. 
	ఈ స్మార్ట్ ఫోన్లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. 
				  																	
									  
	 
	వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్686 సెన్సార్ అందుబాటులో ఉంది.
	దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందుబాటులో ఉన్నాయి.