ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2019 (08:54 IST)

ప్రశాంతంగా సాగుతున్న రెండో దశ ఎన్నికల పోలింగ్

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు దేశవ్యాప్తంగా ఆయా స్థానాల్లో ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండో దశ పోలింగ్‌లో భాగంగా గురువారం కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితోపాటు 12 రాష్ట్రాల్లో 95 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 
 
రెండో దశ ఎన్నికల్లో మొత్తం 427 మంది కోటీశ్వరులు పోటీ పడుతున్నారు. వీరిలో 27 శాతం అభ్యర్థులు రూ.కోటికిపైగా ఆస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొనగా..11 శాతం మంది రూ.5 కోట్లపైన, 41 శాతం మంది అభ్యర్థులు రూ.10 లక్షల్లోపు ఆస్తులున్నట్లు పేర్కొన్నారు.
 
అయితే, భారీ ఎత్తున నగదు పట్టుబడటంతో తమిళనాడులోని వేలూరు స్థానానికి పోలింగ్‌ను ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 15,79,34,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1629 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రేపటి పోలింగ్ సందర్భంగా బరిలో ఉన్న కొందరు కీలక నేతలు వీరే...
 
ఉత్తరప్రదేశ్:
హేమమాలిని - బీజేపీ (మథుర)
రాజ్ బబ్బర్ - కాంగ్రెస్ (ఫతేపూర్ సిక్రీ)
 
బీహార్:
తారిఖ్ అన్వర్ - కాంగ్రెస్ (కతిహార్)
 
తమిళనాడు:
కనిమొళి - డీఎంకే (తూత్తుకుడి)
తమిళిసై సౌందర్రాజన్ - బీజేపీ (తూత్తుకుడి)
పొన్ రాధాక్రిష్ణన్ - బీజేపీ (కన్యాకుమారి)
ఏ రాజా - డీఎంకే (నీలగిరి)
కార్తీ చిదంబరం - కాంగ్రెస్ (శివగంగ)
 
కర్ణాటక:
దేవెగౌడ - జేడీఎస్ (తుముకూరు)
సుమలత - ఇండిపెండెంట్ (మాండ్య)
నిఖిల్ కుమారస్వామి - జేడీఎస్ (మాండ్య)
ప్రకాశ్ రాజ్ - ఇండిపెండెంట్ (బెంగళూరు సెంట్రల్)
 
మహారాష్ట్ర:
ప్రకాశ్ అంబేద్కర్ - వంచిత్ బహుజన్ అఘాడీ (అకోలా)
 
జమ్ముకశ్మీర్:
ఫరూక్ అబ్దుల్లా - నేషనల్ కాన్ఫరెన్స్ (శ్రీనగర్)
జితేంద్ర సింగ్ - బీజేపీ (ఉధంపూర్)