శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2019 (10:42 IST)

తల్లిదండ్రులు ఓటేస్తే విద్యార్థులకు బంపర్ ఆఫర్..!

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు ఓటర్లకు తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనుల గురించి హామీలు, వరాలు ఇస్తుంటారు. సరిగ్గా ఓ కాలేజీ కూడా ఇలాగే వరం ఇచ్చింది. అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే ఆ వరం ఇచ్చింది ఓటర్లకు కాదు... ఆ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు. 
 
'తల్లిదండ్రులు ఓటేస్తే పిల్లలకు పది మార్కులు ఎక్కువ కలుపుతాం' అంటూ హామీ ఇచ్చింది. అయితే ఆ కాలేజీ ఉన్నది మాత్రం ఇక్కడ కాదు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.. లక్నోలోని క్రైస్ట్ చర్చి కాలేజీ విద్యార్థుల తల్లిదండ్రులు ఓటేస్తే.. విద్యార్థుల ఫైనల్ రిజల్ట్‌లో పది మార్కులు కలుపుతామని ఆ స్కూలు ప్రిన్సిపాల్ ఆర్కే ఛత్రీ హామీ ఇచ్చారు. చెప్పడమే కాదు గేటుకు పెద్ద బ్యానర్ కూడా కట్టారు.
 
ఈ ప్రజాస్వామ్యంలో ఓటు ఒక ఆయుధం. భావి తరాల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందంటూ, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మా విన్నపం ఏంటంటే అందరూ ఓటేయండి. ఓటు వేసిన వారి పిల్లలకు ఫైనల్ రిజల్ట్‌లో పది మార్కులు అదనంగా కలుపుతాం” అని ఆ బ్యానర్‌లో వివరించారు.