శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 మార్చి 2018 (16:07 IST)

మహిళా టీచర్‌తో సంబంధం.. వద్దన్నందుకు తల్లిని చంపేసిన యువతి.. ఎక్కడ?

స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావంతో యువత పెడదోవ పడుతున్నారు. తాము అనుకున్నది సాధించుకోవడం కోసం తల్లిదండ్రులను క్షోభ పెడుతున్నారు. ఇలాంటి ఘటనే యూపీలోని ఘజియాబాద్‌లో ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి మరో య

స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావంతో యువత పెడదోవ పడుతున్నారు. తాము అనుకున్నది సాధించుకోవడం కోసం తల్లిదండ్రులను క్షోభ పెడుతున్నారు. ఇలాంటి ఘటనే యూపీలోని ఘజియాబాద్‌లో ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి మరో యువతితో అఫైర్ పెట్టుకుంది. ఈ అఫైర్‌ను సదరు యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. చివరికి తల్లినే ఆ యువతి హతమార్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. మహిళా టీచర్‌తో సంబంధం పెట్టుకోవద్దని తల్లి హెచ్చరించడంతో 18ఏళ్ల యువతి ఈ నెల 9న 38 ఏళ్ల తల్లిని కర్ర, ఇనుప రాడ్డుతో బలంగా కొట్టి హతమార్చింది. మహిళా టీచర్‌తో కలిసి వుండటానికి నిందితురాలి తల్లిదండ్రులు అనుమతించకపోవడంతో తల్లిని చంపి పారిపోదామనుకుంది. ఈ ఘటనపై నిందితురాలిపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తల్లిని హతమార్చిన యువతిని అరెస్ట్ చేశారు. అలాగే నిందితురాలైన యువతితో సంబంధం పెట్టుకున్న టీచర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ ఘటనపై నిందితురాలి తండ్రి మాట్లాడుతూ.. మహిళా టీచర్‌తో కలిసి జీవించేందుకు 18ఏళ్ల తన కుమార్తె (నిందితురాలు) ఇంటి నుంచి రెండు నెలల ముందే పారిపోయిందని.. మైనర్ కావడంతో ఇంటికి తీసుకొచ్చామని చెప్పారు. అయితే ఇంత దారుణానికి ఒడిగడుతుందని తాను భావించలేదని తండ్రి వాపోయాడు.