శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 జూన్ 2018 (11:59 IST)

బాలికపై 21 మంది సామూహిక అత్యాచారం... మద్యం, గంజాయి అలవాటు చేసి?

తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని తిరువళ్లూరులో ఓ బాలికపై 21 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. బాలికకు గంజాయి, మద్యం అలవాటు చేసి.. బాలికపై తోటి విద్యార్థులే అత్యాచారానికి పాల్పడ్డ

తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని తిరువళ్లూరులో ఓ బాలికపై 21 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. బాలికకు గంజాయి, మద్యం అలవాటు చేసి.. బాలికపై తోటి విద్యార్థులే అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరులోని ఓ ప్రాంతంలో కూలి పనులు చేసే దంపతుల కుమార్తె (బాధితురాలు) పదో తరగతి చదువుతోంది. అయితే పేదరికం వల్ల చదువును ఆపేసి..ఇంట్లోనే వుంటోంది. ఈ క్రమంలో తనతో పాటు చదివిన ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు ఆమెను పలు చోట్లకు తీసుకువెళుతూ మద్యం, గంజాయి అలవాటు చేశాడు. 
 
ఈ నేపథ్యంలో, గత నెల 5న బాధితురాలు అదృశ్యమైంది. అన్నిచోట్ల వెతికిన తల్లిదండ్రులు చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను బస్టాండ్ వద్ద మత్తులో ఉన్న స్థితిలో కనిపించింది. ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరపగా.. గదిలో తనను బంధించారని ప్రేమికుడితో పాటు 21 మంది తనపై అత్యాచారం జరిపినట్లు తెలిపింది.