గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 14 జనవరి 2018 (13:19 IST)

అగ్ని-5 పరీక్షకు సిద్ధమైన భారత్.. పాకిస్థాన్‍కు ముచ్చెమటలు

భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అగ్ని సిరీస్‌లో భాగంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక క్షిపణి అగ్ని-5ను పరీక్షించేందుకు సమాయత్తమవుతోంది.

భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అగ్ని సిరీస్‌లో భాగంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక క్షిపణి అగ్ని-5ను పరీక్షించేందుకు సమాయత్తమవుతోంది. ఈనెల 18, 19 తేదీల్లో ఒక రోజున దీనిని పరీక్షించేందుకు వ్యూహాత్మక దళాల కమాండ్ సన్నాహాలు చేస్తోంది. పరీక్షకు అవసరమైన అన్నింటిని దాదాపు సిద్ధం చేశారు.
 
మొత్తం 17 మీటర్ల పొడవు ఉండే అగ్ని-5 క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అవలీలగా తుత్తునియలు చేయగలదు. 1.5 టన్నుల వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఇది ఏక కాలంలో పలు లక్ష్యాలపై దాడి చేయగలదు. శత్రుదేశ రాడార్లకు చిక్కకుండా తన పనిని పూర్తి చేయగలదు. 
 
అగ్ని-5కు ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉండడంతో పరీక్షల నిమిత్తం ఇండోనేషియా, ఆస్ట్రేలియాలను అప్రమత్తం చేయనున్నట్టు సమాచారం. మరోవైపు ఈ అగ్ని-5 పరీక్షతో పాక్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పాక్‌ మొత్తం ఈ క్షిపణి పరిధిలోకి వస్తుండడంతో దాని వెన్నులో వణుకు మొదలైంది.