1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (15:58 IST)

ఉల్లి రేట్లు సెంచరీ కొట్టేందుకు వెళ్తుంటే.. దొంగలు అలా ఎత్తుకెళ్లిపోయారు..

ఉల్లి రేట్లు సెంచరీ కొట్టేందుకు సిద్ధమవుతున్న వేళ ఉల్లిపాయలు చోరీకి గురయ్యాయి. అదీ ఓ రైతు ఇంట్లో నిల్వ చేసిన లక్ష రూపాయల విలువ చేసే ఉల్లిపాయల్ని ఎవరో చోరీ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఉల్లిపాయల ఎగుమతికి కేంద్రమైన నాశిక్ జిల్లాలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలో ప్రమాదకరమైన దొంగలు తయారయ్యారు.. రకరకాల చోరీసు చేస్తూ భయపెడుతున్నారు. 
 
తాజాగా ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో వాళ్ల కళ్లు ఉల్లిపై పడ్డాయి. ఇందులో భాగంగా కల్వాన్ ఊరిలో రైతు రాహుల్ బాజీరావ్... తన ఇంటినే స్టోర్ రూమ్‌గా మార్చుకొని ఉల్లిపాయల్ని జాగ్రత్తగా దాచుకున్నాడు. రోజూలాగే ఇంట్లో వాళ్లంతా ఆదివారం పొలానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరచివున్నాయి. అంతే అక్కడ వుంచిన ఉల్లి చోరీకి గురయ్యాయి. 
 
ఈ విషయాన్ని ఆ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేటుగాళ్లను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే చోరీకి గురైన ఉల్లిని అమ్మేసి వుంటారని.. పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రైతు ఉల్లికి తగిన రేటును ఇచ్చేందుకు గానూ నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను వేగవంతం చేస్తున్నారు.