శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2017 (12:55 IST)

తల్లిపై అత్యాచారయత్నం... ప్రతిఘటించడంతో ప్రాణం తీశాడు...

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కామంతో కళ్ళుమూసుకునిపోయిన కామాంధుడు ఒకడు.. కన్నతల్లిపైనే కన్నేశాడు. పీకల వరకు మద్యం సేవించి అమ్మపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. కన్నబిడ్డ చేస్తున్న పాడుపనికి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కామంతో కళ్ళుమూసుకునిపోయిన కామాంధుడు ఒకడు.. కన్నతల్లిపైనే కన్నేశాడు. పీకల వరకు మద్యం సేవించి అమ్మపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. కన్నబిడ్డ చేస్తున్న పాడుపనికి షాక్ తిన్న తల్లి ప్రతిఘటించింది. దీంతో ఆమెను కొట్టి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మధ్యప్రదేశ్‌లోని కైలారస్ గ్రామానికి చెందిన సూరజ్ మిట్టల్(24) అనే యువకుడకి మద్యం సేవించే అలవాటు ఉంది. మిట్టల్ తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. ఈ మహిళ భర్త ఎనిమిదేళ్ళ క్రితం చనిపోయాడు. అయితే, మద్యం మత్తులో ఉన్న మిట్టల్.. తన తల్లిపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దీంతో ఆవిడ ప్రతిఘటించింది. 
 
తాగిన మైకంలో ఉన్న సూరజ్.. తల్లిని బండరాయితో మోది హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా ఇంట్లోనే నిద్రపోయాడు. అయితే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. సూరజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు.