గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 25 ఏప్రియల్ 2018 (08:45 IST)

గోల్డ్ లోన్ ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి...

గోల్డ్ లోన్ ఇస్తానని ఓ మహిళను నమ్మించి తన ఇంట్లోకి తీసుకెళ్లి ఆపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒడిషా రాష్ట్రోలోని భువనేశ్వర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

గోల్డ్ లోన్ ఇస్తానని ఓ మహిళను నమ్మించి తన ఇంట్లోకి తీసుకెళ్లి ఆపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఒడిషా రాష్ట్రోలోని భువనేశ్వర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
భువనేశ్వర్ నగరానికి చెందిన ఓ వివాహిత తన బంగారం కుదువ పెట్టుకొని రుణం ఇవ్వాలని ఆలయపూజారి సరోజ్ కుమార్ దాస్‌ను సంప్రదించింది. రుణమిస్తాను రమ్మంటూ ఇంటికి పిలిచిన పూజారి వివాహితకు మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చాడు. అది తాగిన వివాహిత అపస్మారక స్థితిలోకి జారుకోగానే, ఆమెపై అత్యాచారం చేశాడు. చేసిన ఘనకార్యాన్ని మొబైల్‌లో చిత్రీకరించాడు. 
 
అనంతరం పూజారి తనతో సంబంధం పెట్టుకోవాలని వివాహితను బ్లాక్ మెయిల్ చేశాడు. దానికి వివాహిత నిరాకరించడంతో పూజారి అశ్లీల వీడియోను వివాహిత భర్త, బంధువులకు వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా పంపించాడు. దీనిపై వివాహిత చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.