శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 నవంబరు 2020 (06:26 IST)

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కన్నుమూత

కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని వరుస దెబ్బలు తగులుతున్నాయి. రెండు రోజుల క్రితం సీనియర్ నేత తరుణ్ గొగోయ్ మృతి నుంచి కోలుకోక ముందే పార్టీలో అత్యంత ముఖ్యునిగా భావించే సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్​ పటేల్​ (71) అహ్మద్ పటేల్ కూడా కన్నుమూశారు.

నెల రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు ఫైజల్​ ట్విటర్​ ద్వారా వెల్లడించారు. కరోనా బారిన పడి పలు అవయవాలు దెబ్బతినడంతో అహ్మద్ పటేల్ కన్నుమూశారని పేర్కొన్నారు.

అహ్మద్​ పటేల్​ తాను కరోనా బారిన పడినట్లు అక్టోబర్​ 1న ట్విటర్​ ద్వారా తెలిపారు. అనంతరం నవంబర్​ 15న ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో అహ్మద్​ పటేల్ తుదిశ్వాస విడిచారు.