1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 3 జూన్ 2018 (14:49 IST)

కన్నబిడ్డను చర్చిలో వదిలిపెట్టేశాడు.. నుదుటిపై ముద్దెట్టి..?

కేరళలోని కొచ్చిలో కన్నబిడ్డను ఓ తండ్రి నుదుటిపై ముద్దెట్టి చర్చిలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల విచారణలో ఎక్కువమంది పిల్లలు పుట్

కేరళలోని కొచ్చిలో కన్నబిడ్డను ఓ తండ్రి నుదుటిపై ముద్దెట్టి చర్చిలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల విచారణలో ఎక్కువమంది పిల్లలు పుట్టారన్న అవమానంతో ఓ జంట పసిపాపను చర్చిలో వదిలేసి వెళ్లినట్లు తెలిసింది. 
 
వివరాల్లోకి వెళితే.. త్రిస్సూర్‌కు చెందిన బిట్టో, ప్రతిభ దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. రెండు రోజుల క్రితం ప్రతిభ మరో పాపకు జన్మనిచ్చింది. అయితే నలుగురు పిల్లల్ని కన్నారని అందరూ విమర్శించారు. దీంతో శుక్రవారం సాయంత్రం ఎడప్పల్లిలోని సెయింట్ జార్జ్ ఫొరెన్ చర్చిలో కన్నబిడ్డను వదిలేసి వెళ్లారు.
 
చిన్నారి అరుపులు విన్న సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించడంతో.. తల్లిదండ్రులే చిన్నారిని అక్కడ వదిలేసి వెళ్లారని తేలింది. వారిద్దరిపై కేసు నమోదు చేశారు.