1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జూన్ 2024 (19:53 IST)

ఐఏఎస్ దంపతుల కుమార్తె.. 10వ అంతస్థు నుంచి దూకేసింది.. కారణం?

suicide
ఐఏఎస్ దంపతుల కుమార్తె అయిన 27 ఏళ్ల మహిళ సోమవారం తెల్లవారుజామున దక్షిణ ముంబైలోని మంత్రాలయ సమీపంలోని ప్రభుత్వ నివాస భవనంలోని 10వ అంతస్థు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. 
 
హర్యానాలోని సోనిపట్‌లో ఎల్‌ఎల్‌బి కోర్సును అభ్యసిస్తున్న న్యాయ విద్యార్థి లిపి రస్తోగి తెల్లవారుజామున 4 గంటలకు మంత్రాలయ సమీపంలోని ఐఎఎస్ అధికారుల ప్రభుత్వ వసతి గృహంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ దారుణమైన నిర్ణయం తీసుకుందని పోలీసులు తెలిపారు. 
 
స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినా చికిత్స ఫలించక ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసుల విచారణలో భాగంగా ఆమె గదిలో కనుగొనబడిన సూసైడ్ నోట్, లిపి తన నిర్ణయానికి ఎవరూ బాధ్యులు కాదని తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.