శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 27 అక్టోబరు 2018 (17:19 IST)

వామ్మో దీపావళి.. వణికిపోతున్న ఢిల్లీ ప్రజలు.. ఎందుకు?

దీపావళి పర్వదినం వస్తేనే.. అందరూ ఎగిరిగంతేస్తారు. కానీ దేశ రాజధాని ఢిల్లీ వాసులు మాత్రం వణికిపోతున్నారు. ఎందుకో తెలుసా? దీపావళికి తర్వాత ఓ పదిరోజుల తర్వాత.. ఆ రాష్ట్రంలో అత్యంత విషపూరిత వాయువులు మరింత వ్యాపిస్తాయని తెలుస్తోంది.
 
గత కొంతకాలంగా దేశ రాజధాని ఢిల్లీలో విష వాయువులు అధికంగా వ్యాపిస్తుండడం.. కాలుష్యం అధికంగా ఉంటుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యంపై ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా.. వాయు కాలుష్యం భూతంగా మారిపోతోంది.

దీనికి తోడు టపాకాయల్ని దీపావళికి కాల్చడంతో ఏర్పడే కాలుష్యంతో పరిస్థితి మరింత దిగజారే అవకాశం వున్నట్లు ఢిల్లీ కాలుష్య నియంత్రిణ మండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
దీపావళి రోజు టపాకాయలు కాల్చడానికి కేవలం రెండు గంటలు మాత్రమే సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చినప్పటికి ... ఆ రెండు గంటలు కూడా ఎంతటి ప్రమాదానికి కారణం అవుతుందోనని ఢిల్లీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్య నియంత్రిణ మండలి పలు సూచనలు చేసింది. నిర్మాణ పనులు, విద్యుత్ రంగానికి సంబంధించిన పనులను బ్యాన్ చేయాలని సూచించింది.